తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆరు వారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చేతి కర్ర సాయంతో నడుస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో కోలుకుని సాధారణ స్థితికి వస్తారని వైద్యులు తెలిపారు. కేసీఆర్ నడుస్తున్న వీడియోను ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్ చేశారు. త్వరలోనే కేసీఆర్ పూర్తిస్థాయిలో తనంతట తాను నడుస్తారని పేర్కొన్నారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ