హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణవ్యాప్తంగా సంబురాలు హోరెత్తగా, ఏపీలోని విజయవాడలో బీఆర్ఎస్ పోస్టర్లు వెలిశాయి.
విజయవాడ వారధి ప్రాంతంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్ పేరిట ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతోపాటు కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్తోపాటు నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
బెజవాడలో మిన్నంటిన సంబురాలు
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో విజయవాడలో సంబురాలు జరిగాయి. ఏపీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఆదినారాయ ణ నేతృత్వంలో బెజవాడలో పలుచోట్ల పటాకులు కాల్చారు. త్వరలో విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.