హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెన ఈ వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మొదటి రోజుల వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏడున్నరేండ్లుగా మహిళాభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిని లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు వేడుకలు నిర్వహించారు.
ఆదివారం మొదటిరోజు సీఎం కేసీఆర్ ఫొటోకు రాఖీలు కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ వరర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానాలు చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో..
వనపర్తి జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..
మొదక్ జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో..