హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ నాయకత్వం, వ్యూహాలు దేశానికి అవసరమని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) సీనియర్ నేత, కేరళలోని కొల్లాం ఎంపీ, మాజీ మంత్రి ఎన్కే ప్రేమచంద్రన్ చెప్పారు. దేశంలో బీజేపీయేతర శక్తులను, మేధావులను ఏకం చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రేమచంద్రన్ వివరించారు. దేశంలో బలమైన విపక్షం లేకనే బీజేపీ ఆటలు సాగుతున్నాయని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బలమైన ప్రభావాన్ని చూపగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వినోద్కుమార్ మాట్లాడుతూ.. ప్రేమచంద్రన్ ఉత్తమ పార్లమెంటేరియన్, సంసద్త్న్ర అవార్డు గ్రహీత అని గుర్తుచేశారు. పార్లమెంట్లో సహచర ఎంపీ గా ప్రేమచంద్రన్తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. దేశ రాజకీయాలపై ప్రేమచంద్రన్కు విశేషమైన పట్టు ఉన్నదని పేర్కొన్నారు. ఈ భేటీలో ఆర్ఎస్పీ నాయకులు కే రేజీకుమార్, వీ సునీల్ పాల్గొన్నారు.