నిజామాబాద్ : దేశ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతవరకైనా కొట్లాడుతారని, ఆయన వ్యక్తి కాదు ఓ శక్తి అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్,మోర్తాడ్ మండలాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలకు చెందిన వార్డు సభ్యులు,నాయకులు,యూత్ సభ్యులు పలువురు శనివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్లతో ప్రజలు విసిగిపోయారని పేర్నొన్నారు. కేసీఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలనే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడుతారని అన్నారు. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థకు కేసీఆర్ అంతే అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తూ, బీఆర్ఎస్ ను అక్కున చేర్చుకుంటున్నారన్నారు.
తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని అదోగతి పాలు చేస్తుందని,తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులకు కల్లాలు వద్దనడం బీజేపీ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
బీఆర్ఎస్లో చేరిన నాయకులు వీరే..
వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రా మానికి చెందిన బీజేపీ వార్డు సభ్యులు ఆది మహిపాల్, ఉప్పరి మోహన్ , పీఎసీఎస్ మాజీ డైరెక్టర్ సుంకరి సాయిలు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీకాంత్, మైనారిటీ విభాగం నుంచి షేక్ కరీం , కానురి వినోద్, తుప్ప రాజశేఖర్, మున్నూరు కాపు సంఘం సభ్యులు కొల్లే సంఘం సభ్యులు తదితరులు బీఆర్ఎస్లో చేరారు.మోర్తాడ్ మండలం నుంచి బీఎస్పీ పార్టీకి చెందిన శివ, ధరం,రాజశేఖర్, ప్రవీణ్,నిఖిల్,సంజయ్, సాయితేజ తదితరులు పార్టీలో చేరారు.