వరంగల్ : ప్రత్యేక తెలంగాణ కోసం 2009 నవంబర్ 29 న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రనే మార్చివేసిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని రవీందర్ అన్నారు.
ఆ దీక్షకు నేటికి 12 ఏండ్లు అవుతున్న సందర్బంగా ప్రతి ఏటా నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా వరంగల్లోని చింతల్ బ్రిడ్జి తెలంగాణ తల్లి జంక్షన్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. తెలంగాణా వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమంలో తన ప్రాణాలను లెక్కచేయకుండా ముందుకు కదిలి తెలంగాణా సాధించారని ప్రశంసించారు. ఎందరో వీరుల పోరాటం, అమరుల త్యాగఫలంతో తెలంగాణను సాదించుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణా ఏర్పాటు తర్వాత రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. దీక్షా దివస్ సందర్భంగా నాటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నామని, కేసీఆర్ఉద్యమ చరిత్ర 15 తరాలకు తెలిసేలా ఏర్పాట్లు చేసి గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామని ఎమ్మెల్యే న అన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.