KCR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గలీజ్గా మాట్లాడుతున్నాడరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొన్న నేను సూర్యాపేటలో మాట్లాడితే. నేను మొన్న మాట్లాడితే.. ఎంత గలీజ్గా అంటే.. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని నేను చెబితే.. 48గంటల్లో వివరాలు ఇవ్వండి.. నష్టపరిహారం ఇస్తామన్నారు. కానీ, మేం నాలుగు గంటల్లోనే లిస్ట్ను సీఎస్కు పంపినం. 209 మంది జాబితా పంపినం. దాని తర్వాత ఐదు, పది జరిగినయ్. ఇప్పటి వరకు ఉలుకూ లేదు పలుకూ లేదు. మీ అసమర్థత వల్ల చనిపోయారు కాబట్టి.. తలా రూ.25లక్షల వెంటనే రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించి.. పరామర్శించాలి. మీకు ఉసురు, పాపం తగులుతుంది. మిమ్మల్ని వదిలిపెట్టమని చెబుతున్నా. పంట కోసం పెట్టుబడి పోయింది. వస్తదనుకున్న పంట పోయింది’ అన్నారు.
‘రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతున్నరు. నేను వద్దని వాళ్లకు దండం పెట్టి చెప్పాను. ఖచ్చితంగా ఎకరానికి రూ.25వేల పరిహారం ఇవ్వాలి. పంటలు ఎండిన మాట వాస్తవం. నష్టం జరిగింది వాస్తవం. రైతాంగం కన్నీరు మున్నీరవుతున్న మాట వాస్తవం. 10-15లక్షల ఎకరాలంటే చిన్న మాట కాదు. ప్రకృతి విపత్తుకన్నా పెద్దది. ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే ఎవరు ఆదుకోవాలి ? దాని కోసం మేం డిమాండ్ చేస్తున్నాం. తప్పించుకుందామనుకుంటే.. మీ వీపులు విమానం మోత మోగిస్తరు ప్రజలు. మిమ్మల్ని వదిలిపెట్టరు. మీ డ్రామాలు వడవవు. మొన్న సూర్యాపేటలో చెప్పిన. నాలుగు మాసాల వరకు నోరు తెరువలేదు. టైమ్ ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి అని మాట్లాడలేదు.
వాళ్లు ఎన్ని పిచ్చిపిచ్చి ఆరోపణలు.. పీఆర్ స్టంట్స్.. తొత్తులుగా ఉన్న మీడియాతో అడ్డగోలుగా వార్తలు రాయించి.. ఏం చెప్పినా మేం మాట్లాడలేదు. గంభీరంగా ఉన్నాం. పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం. మంచిచెడ్డ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేం చెప్పేది ఎండిపోయిన పంటల గురించి. వట్టిగా తమాషకు చెప్పడం లేదు. రైతులే ఫొటోలు ఇచ్చారు. పంటలు భయంకరంగా ఎండిపోయాయి. నేను సూర్యాపేట జిల్లాకు వెళ్తే. అక్కడ జిల్లాకు నీళ్లు కాల్వల్లోకి నీరు వచ్చాయి. తెల్లారే ఫోన్లు వచ్చాయి. మీ బస్పోంగనే నీళ్లు వాపస్ పోయినయని. సాగర్లో డెడ్స్టోరీ మీద 14 టీఎంసీలు ఉన్నయ్. ఎందుకు వాడుతలేరు ? కేఆర్ఎంబీ ఎవడు? మనకు బాసా? రెండు రాష్ట్రాల మధ్య సమన్వయకర్త. మన మీద పెత్తనం ఎందుకు ఉంటది? అని చెబితే.. ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు వదులుతరు. కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే.. మొత్తం కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్లు వదులుతరు’ అన్నారు.
‘సిగ్గులేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నడు. కేసీఆర్ గారు ముందే చెప్పచ్చుగదా నీళ్లు వదలాలని.. ముఖ్యమంత్రివి నువ్వా? నేనా? ఇవాళ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు? నీ ఇంజినీర్లు ఏం చేస్తున్నరు ? ని డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది.. ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నడు? నువ్వేం చేస్తున్నవ్ ? ప్రభుత్వం నీది కదా? ప్రజలు నిన్ను గెలిపించారు కదా? ముందే చెప్పాలది కదా అంటున్నడు. సూర్యాపేట నుంచి బయలుదేరుడు మొదలుపెడితే ఇవాళ్టి వరకు మూడు కాలువల్లోకి నీరు వదిలారు. ఇదేం కథా? ఈ తెలివి ముందెక్కడ పోయింది. ఎందుకు వేల ఎకరాల్లో పంటలు ఎండపెట్టారు ? నాగార్జున సాగర్ కాలువ కొద్దిరోజుల ద్వారా కొద్దిరోజుల ముందు ఇచ్చి ఉంటే.. వేల ఎకరాలు ఒక తడికోసం ఎదురుచూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా 20 రోజుల కిందట వదిలి ఉంటే.. ప్రతి గ్రామంలో వందల ఎకరాల్లో పంట దక్కేది. ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక.. ఉన్న వనరులు, వసతులు తెలివితో వాడుకోక.. క్వాలిటీ కరెంటు అందించక.. రైతుబంధు సమయానికి ఇవ్వక.. ప్రజలను వెర్రితిర్రి మాటలతో ప్రజలను గందరగోళానికి గురి చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు