హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు. కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చిందని ప్రజలే ఎద్దేవా చేస్తున్నారని చెప్పారు. ప్రజావాణిలో దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పరిషారం లేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఆదివారం మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉన్న పాలనాచాతుర్యం కాంగ్రెస్ నాయకులకు లేదని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు పాలన వదిలేసి కేసీఆర్ను తిట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, రోజూ మినీ క్యాబినెట్ మీటింగ్లతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ఏ చెరువును చూసినా, చెట్టును చూసిన కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రణాళికతో ప్రతి చెరువు నీళ్లతో కళకళలాడేదని గుర్తుచేశారు.
దేశంలోనే తెలంగాణను మాడల్ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారని కొనియాడారు. కేసీఆర్ ఎవరినైనా మోసం చేశారా? అని ప్రశ్నించారు. ప్రగతిభవన్ను ఖాళీ చేస్తే పాత ఇంటికి పోయారని, సొంతంగా ఇల్లు కూడా కట్టుకోలేదని వివరించారు. మలాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు గెలవడం అద్భుతమని, ఈ గెలుపు ఘనత కేటీఆర్కే దకుతుందని స్పష్టంచేశారు. కేటీఆర్ హయంలో హైదరాబాద్ రూపురేఖలు మారాయని వివరించారు. ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ లేకుండా ప్రజలు చూడలేకపోతున్నారని పేర్కొన్నారు. మలాజిగిరిలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ అక్షింతలు పంచుడు తప్ప తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నించారు.
వీధిరౌడీలా మాట్లాడుతున్న సీఎం: శంభీపూర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోదాను మరిచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను ఖతం చేయడం రేవంత్రెడ్డి తాత, ముత్తాతల వల్ల కూడా కాదని చెప్పారు. రేవంత్ కన్నా ముందు కూడా ఎందరో నేతలు బీఆర్ఎస్ గురించి మాట్లాడారని, ఆయన గురువుకు కూడా తాము భయపడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ను చీల్చేందుకు ప్రయత్నించి విఫలమైందని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని, గతంలో లాగా మాట్లాడితే కుదరదని హితవు చెప్పారు. కాంగ్రెస్ ఇటుకతో కొడితే మేము రాయితో కొడతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్తోనే ప్రజలకు మేలు: మర్రి
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయని, అది బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు. కంటోన్మెంట్ సమస్యలకు బీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే పరిషారం దొరుకుతుందని అన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. మలాజిగిరి ఎంపీగా రేవంత్రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. మలాజిగిరి ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. హామీల గురించి అడిగితే మంత్రులు వారి స్థాయిని మరచి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీలు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని సర్వేలు చెప్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, దావోస్లో ఒక సీఎంలాగా వ్యవహరించలేదని విమర్శించారు.