హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ‘ఈద్ ఉల్ ఫితర్’ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని, ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని పేర్కొన్నారు.
లౌకికవాద విలువలకు ప్రాధాన్యమిస్తూ, విభిన్న మతాల సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ, గంగా జమునా తహజీబ్కు ప్రతీకగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పునకు దోహదం చేశాయని వివరించారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.