ఖమ్మం, ఆగస్టు 20: ఉద్యమ నేత, సీఎం కేసీఆర్పై అభిమానంతో ఏకంగా ‘కేసీఆర్ కోటి’ రాశాడు ఖమ్మం నగరానికి చెందిన కోసూరు వెంకట నర్సింహారావు. 35 ఏళ్లుగా నగరంలో టైలరింగ్ వృత్తిలో ఉన్న ఆయన ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ను ఇష్టపడుతున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడయ్యారు. గురుకులాల్లో మెరుగైన విద్య అందుతుందని తెలుసుకుని తన ఇద్దరు కుమారులు నిహాల్, విశాల్ను బీసీ గురుకులాల్లో చేర్పించారు. తన తండ్రి రాధాకృష్ణకు ఆసరా పింఛన్ అందుతుందని, తన కుటుంబానికి ఇంత మేలు చేసిన కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కాం క్షిస్తూ ‘కేసీఆర్ కోటి’ రాశానని చెప్తున్నాడు నర్సింహారావు. రెం డేళ్ల నుంచి కేసీఆర్ కోటి రాస్తున్నానని, దర్జీగా పని చేస్తూనే ఖాళీ సమయంలో ‘కోటి గ్రంథం’ రాశానంటున్నారు.