జగిత్యాల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ను బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు బుధవారం పరామర్శించారు. సంజయ్ తండ్రి సీనియర్ న్యా యవాది మాకునూరు హన్మంతరావు గత నెల 29న మృతిచెందారు. జగిత్యాలలో బుధవారం నిర్వహించిన హన్మంతరావు స్వర్గపా త్ర కార్యక్రమానికి హాజరైన కేసీఆర్.. హన్మంతరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జగిత్యాలలో దాదాపు ఆరున్నర దశాబ్దాలకుపైగా న్యాయవాద వృత్తిలో కొనసాగి, న్యాయవాద వృత్తికి హన్మంతరావు చేసి న సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించి, ప్రగాఢసానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి హరీశ్రావు సైతం హన్మంతరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సంజయ్ను మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ లక్ష్మణ్కుమార్, మాజీ మం త్రులు ప్రశాంత్రెడ్డి, సుద్దాల దేవయ్య, రాజేశంగౌడ్, ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మేడిపల్లి సత్యం, సత్యనారాయణ, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మె ల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పరామర్శించారు.