KCR | పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారు చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో మంగళవారం గులాబీ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
కేసీఆర్ బస్సు యాత్ర నేపథ్యంలో ఓ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ అధికార పక్షానికి వణుకు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను ఎండగడుతూ.. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ట్రైలర్ను రూపొందించారు. ఇటీవల కేసీఆర్ మాట్లాడిన మాటలను కూడా ఈ ట్రైలర్లో పొందుపరిచారు. బీఆర్ఎస్ తెలంగాణ దళం.. తెలంగాణ గళం.. అని కేసీఆర్ గర్జించిన మాటలు అధికార పక్షానికి గుండెల్లో దడ పుట్టిస్తోంది. రైతుబంధు, 24 గంటల ఫ్రీ కరెంట్ వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. నిలబడుతామని అనుకున్నారు.. కానీ మూడు నెలల్లోనే ఇంత మార్పు జరిగితే, పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కళ్లల్లో కూడా నీళ్లు వస్తున్నాయని కేసీఆర్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి.
ఆగమవుతున్న తెలంగాణ కోసం ఊతమై వస్తున్నాడు.
కేసీఆర్ బస్సుయాత్ర ట్రైలర్#KCRBusYatra pic.twitter.com/Ljas06AXOd
— BRS TechCell (@BRSTechCell) April 23, 2024