MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 23 వరకు ఉండటంతో సీబీఐ కేసులోనూ అదే తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్టు జడ్జి కావేరీ బవేజా పేర్కొన్నారు. అయితే ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించింది. కవిత పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది.