MLC Kavitha | హైదరాబాద్,డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని, ఆ చర్యను తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ మహిళలను, పండుగలను అవమానించారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి అందరి అమ్మ వంటిదని, ఆ తల్లిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఎన్నారై ఆధ్వర్యంలో ఆదివారం జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు పోషించిన పాత్రను మరవలేమని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో అవహేళనలకు గురైనా తెలంగాణ తల్లి మనలో స్ఫూర్తిని నింపిందని పేరొన్నారు. తెలంగాణ తల్లికి ఉద్యమకారులు, కవులు, కళాకారులు కలిసి రూపం ఇచ్చారని, అటువంటి తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ తల్లికి గెజిట్ అవసరమా?
జొన్నలు, మకలు విదేశాల్లో కూడా పండుతాయని, అలాంటప్పుడు అవి తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమంటూ ప్రభుత్వం చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. విగ్ర హం మార్పు విషయంలోనూ ప్రభుత్వం గోప్య త పాటించిందని, అంత అవసరం ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. ప్రజల ఆమోదం ఉన్నట్టయితే గోప్యత ఎందుకు పాటించినట్టని ప్రశ్నించారు. ఉద్యమ తెలంగాణ తల్లి కోసం మరొక పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ తెలంగాణ తల్లి పట్ల ప్రేమతో విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అనేక గ్రామాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. కొత్త తెలంగాణ తల్లికి గెజిట్ జారీ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని చె ప్పారు. భారత మాత, అంబేదర్, గాంధీ విగ్రహాలకు కూడా గెజిట్ ఉందా అని ప్రశ్నించారు.
బతుకమ్మ పోరాటంలో భాగస్వాములవుతాం: తెలంగాణ ఎన్నారైలు
బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఎన్నారైలు కొనియాడారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని తిప్పికొట్టడంలో తామూ భాగస్వాములవుతామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగడతామని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఉద్యమ తెలంగాణ తల్లిని రక్షించుకునే క్రమంలో తమ వంతు సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈ జూమ్ మీటింగ్లో రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ఆచారి, వివిధ దేశాల బీఆర్ఎస్, జాగృతి నాయకులు జ్యోతి ముద్దం, నవీన్రెడ్డి, నాగేందర్రెడ్డి, సుమన్ బల్మూరి, నాగరాజు గుర్రాల, కల్యాణ్ కాసుగంటి, నందిని, అనిల్ శ్రీకర్, శేఖర్, కిశోర్, ప్రభాకర్, సంపత్, రవి దన్నపునేని, హరిప్రసాద్, శ్వేత, ఆదర్శ, సుకృతి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.