హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా విపతర సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కారుణ్య నియామకాల హక్కుల సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ పోలేబోయిన శేఖర్ కోరారు.
ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవిని గురువారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కారుణ్య నియామకాల అంశంపై సమావేశం కానున్నట్టు వెల్లడించారు. కారుణ్య నియామకాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పిడమర్తి రవి హామీ ఇచ్చినట్టు శేఖర్ తెలిపారు.