హైదరాబాద్ : సఫాయి మిత్ర సురక్ష కింద రూ.3లక్షల క్యాటగిరిలో కరీంనగర్ బల్దియా దేశంలో రెండోస్థానాన్ని కైవసం చేసుకొని రూ.4కోట్ల పారితోషకాన్ని అందుకున్నది. శనివారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ -2021 జాబితాలో ఇండోర్ మొదటి స్థానంలో నిలువగా.. సూరత్, విజయవాడ, నవీ ముంబై, పుణె, రాయ్పూర్, భోపాల్, వడోదర, విశాఖపట్నం, అహ్మదాబాద్ నిలిచాయి. వరుసగా ఐదోసారి ఇండోర్ నగరం తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నది. ఏపీలోని విజయవాడ 3వ ర్యాంకు, విశాఖపట్నం 9వ ర్యాంకు సాధించాయి. గ్రేటర్ హైదరాబాద్ జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు కైవసం చేసుకున్నది. లక్ష నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో తిరుపతి మూడో ర్యాంకును సాధించింది.
50వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో దక్షిణాదిలోనే తొలి ర్యాంకును సిరిసిల్ల జిల్లా సాధించగా.. రెండో ర్యాంకును సిద్ధిపేట సాధించింది. 5వ ర్యాంకును కందుకూర్, 8వ స్థానం పులివెందుల, 10వ ర్యాంకులో పలమనేరు, 12వ ర్యాంకులో సత్తెనపల్లి, 13లో తాడేపల్లి, 14లో బొబ్బిలి, 15లో మండపేట, 16లో వికారాబాద్, 17లో కావలి, 19లో పుత్తూరు, 20వ ర్యాంకులో బెల్లంపల్లి నిలిచింది. 50 వేలలోపు జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో.. నిజాంపేట, మేడ్చల్, ఫీర్జాదిగూడ, శంషాబాద్, పెద్దాపురం, రామచంద్రాపురం, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఇల్లందు, 25వేలలోపు జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో.. ఘట్కేసర్, దమ్మాయిగూడ, హుస్నాబాద్, కొత్తపల్లి, మంథని, పోచారం, తూఫ్రాన్, రాయికల్, నెల్లిమర్ల, చిట్యాల, ఆత్మకూర్, గుండ్లపోచంపల్లి, పోచంపల్లి , స్వచ్ఛ సర్వేక్షణ్లో అన్ని విభాగాల్లో కలిపి లక్షకుపైగా జనాభా విభాగంలో అగ్రభాగాన నిలిచిన 25 నగరాల్లో.. ఇండోర్ తొలి స్థానంలో నిలవగా.. విజయవాడ 3వ స్థానంలో, తిరుపతి 7వ స్థానంలో, విశాఖపట్నం 18వ స్థానంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రభాగాన నిలిచిన 25 జిల్లాల్లో.. 6వ స్థానంలో నిలిచిన హైదరాబాద్, 9వ స్థానంలో విశాఖపట్నం, కృష్ణా 22 స్థానంలో నిలిచింది.
వందకు పైగా అర్బన్ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల జాబితాలో.. 5వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, 10 స్థానంలో తెలంగాణ నిలిచింది. కంటోన్మెంట్ విభాగంలో.. 7వ స్థానంలో నిలిచిన సికింద్రాబాద్ సఫాయి మిత్రా సురక్ష కింద.. 10 లక్షల జనాభా కేటగిరిలో తొలి ర్యాంకు రావడంతో పాటు.. రూ.పది కోట్ల ప్రైజ్మనీ నెల్లూరు సాధించింది. స్మార్ట్ సిటీ విభాగంలో.. తిరుపతికి 3 లక్షల జనాభాకేటగిరిలో తొలి ర్యాంకు, సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో దేశంలో 2వ స్థానం, రూ.2కోట్ల బహుమతి, 3 స్టార్ గార్బేజ్ ఫ్రీ ర్యాంకింగ్లో అవార్డు సాధించింది. పుంగనూరు పురపాలక సంఘానికి సౌత్ జోన్లో తొలి ర్యాంకు జాతీయ అవార్డు దక్కింది.