హైదరాబాద్ సంస్థానంలో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి బోయినపల్లి వెంకటరామారావు (బోవెరా). సెప్టెంబరు 2, 1920న పూర్వపు కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) తోటపల్లి గ్రామంలో జన్మించారు. రంగమ్మ, కొండల్రావు తల్లిదండ్రులు. బోవెరా స్వగ్రామంలోనే తన ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్నారు. కరీంనగర్లో ఉన్నత విద్యనభ్యసించారు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
చిన్న వయస్సులోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. బోవెరాపై ఆర్యసమాజ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. మతఛాందసవాదులతో పో రాడారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 40 మంది జాతీయవాదుల ను సమీకరించారు. గిడ్డంగులపై దాడిచేసి ప్రజలకు బియ్యం పంచారు. ప్రతి గ్రామంలోనూ జాతీయ జెండా ఎగురవేశారు. తోటపల్లి గాంధీ, కరీంనగర్ గాంధీగా మన్ననలందుకున్న బోవెరా అక్టోబరు 27, 2014న కన్నుమూశారు.