హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశమంతా వ్యాపించింది. ఇటీవలే బాలీవుడ్ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ చాలెంజ్లో పాల్గొన్నారు. ముంబైలోని గోరేగాన్లోని ‘దాదాసాహెబ్ ఫాలే చిత్రనగరి ఫిల్మ్ సిటీ’లో ఎంపీ సంతోష్తో కలిసి మొక్కలు నాటారు. ఆదివారం ఇదే విషయాన్ని సోనీ టీవీలో ప్రసారమయ్యే ‘ది కపిల్శర్మ షో’ సెకండ్ సీజన్ 326వ ఎపిసోడ్లో కపిల్ శర్మ ప్రస్తావించారు. ‘హైదరాబాద్కు చెందిన ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను కూడా అందులో భాగస్వామిని అయినందుకు గర్విస్తున్నాను. నా బర్త్ డే సందర్భంగా రెండు వేప మొక్కలను నాటాను. గ్రీన్ ఇండియా చాలెంజ్ అనేది భవిష్యత్తు తరాలకు ఒక వరం’ అని కపిల్ శర్మ కొనియాడారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నటుడు షాయాజీ షిండే సూచించారు.