కామారెడ్డి : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ లో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజల కంటి సమస్యల నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్య సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. కంటి చూపు లేని జీవితం అంధకారమని తెలిపారు.
మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం మంచి ఫలితాలను అందించిందని వివరించారు.రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్ల కేటాయించిందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 44 కంటి వెలుగు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.అవసరమైన వారికి ఉచితంగా కళ్ళద్దాలు అందిస్తారు.కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.