హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కంది సాగర్ (30) సోమవారం ఉదయం వాష్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సాగర్ కంటి చికిత్స నిమిత్తం జూలైలో చంచల్గూడ జైలుకు వచ్చాడు. సాగర్కు 31వ తేదీనే సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరగాలి.
కానీ వాష్రూమ్కు వెళ్లి అక్కడే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. వెంటనే గుర్తించిన తోటి ఖైదీలు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో దవాఖానకు తరలించారు. కానీ మార్గమధ్యలో సాగర్ మృతి చెందినట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.