నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్(Nallgonda Parliament) అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి(Kancharla Krishna Reddy) గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అధినతే కేసీఆర్ నల్లగొండ అభ్యర్థిగా కృష్ణారెడ్డిని నియమించారు. ఈ నేపథ్యంలో కృష్ణా రెడ్డి అందరిని కలుపుకొని పోతూ తన గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. అందులో భాగంగా కోదాడ మాజీ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ను(Mallaiah Yadav) వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఎన్నికల్లో పార్టీ శ్రేణులతో కలిసి సంపూర్ణ సహకారం అందిచాలని ఈ సందర్భంగా కంచర్ల కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. అందుకు మల్లయ్య యాదవ్ సానుకూలంగా స్పందించారు. అనంతరం కృష్ణారెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.