Kamareddy | కామారెడ్డి: లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్సింగ్ను అరెస్టు చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు కూడా ఆదేశించింది.
ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్ సింగ్ నాయక్ బుధవారం నాడు కామారెడ్డి డీఎంహెచ్వో కార్యాలయానికి వచ్చి వివరాలనను సేకరించారు. ఈ సందర్భంగా తమను డీఎంహెచ్వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్సింగ్పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని.. కోర్టులో ప్రవేశపెట్టినట్లుగా డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.