హైదరాబాద్ : తెలంగాణలో కులాంతర వివాహాలకు కూడా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేసి, చెక్లు అందిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ రెండు పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కులాంతర వివాహాలకు ఇబ్బంది లేదు. భార్య బీసీ, భర్త ఓసీ అయినప్పటికీ చెక్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఒక వేళ ఎక్కడైనా సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సభ్యులకు మంత్రి సూచించారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వారి విషయానికి వస్తే.. తల్లికి లేదా బిడ్డకు చెక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ పది రోజుల్లో సుమారు 12 వేల మంది లబ్ధిదారులకు చెక్లు అందాయి. కొంత మంది పెళ్లి చేసుకున్న తర్వాత మూడు నాలుగు నెలలకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో తనిఖీ తర్వాత చెక్లు అందిస్తామన్నారు. ఈ పథకాలకు నిధుల కొరత లేదు. దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజులకే చెక్కులు ఇస్తున్నామని తెలిపారు. దరఖాస్తు పెట్టించే బాధ్యత సర్పంచ్లు, కౌన్సిలర్లు తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.