సిరిసిల్ల రూరల్,జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ నేత పొన్నం శ్రీనివాస్ గౌడ్కు కల్యాణ లక్ష్మి చెక్కు ను ఆదివారం టీఆర్ఎస్ నేతలు అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పొన్నం శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహం ఇటీవలే జరిగింది. కాగా, శ్రీనివాస్ భార్య వాణి పేరిట కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 మంజూరయ్యాయి.
ఈ మేరకు ఆదివారం టీఆర్ఎస్ నేతలు వారి నివాసానికి వెళ్లి చెక్కును అందజేశారు. దీంతో బీజేసీ నేత సంతోషం వ్యక్తం చేస్తూ..టీఆర్ఎస్ నేతలకు స్వీట్లు తినిపించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ గొడిసెల నీరజ, ఎంపీటీసీ పుర్మాని కనకలక్ష్మి, గ్రామ శాఖ అధ్యక్షుడు కర్నె బాలయ్య, సత్తు రాంరెడ్డి, ఎల్లయ్య, దేవరాజు,శోభన్ ఉన్నారు.