ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 : వచ్చే ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన 60 కుటుంబాల వారు ప్రకటించారు.
ఈ మేరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. శుక్రవారం కాలనీలో భగత్సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్తో కలిసి ఎమ్మెల్యే కాలనీని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించారు.