Kaleswaram Water : కరువు తీర్చే కాళేశ్వర గంగమ్మ యాదాద్రికి చేరుకుంది. కాళేశ్వరం జలాలు సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి యాదాద్రి జిల్లాను ముద్దాడాయి. తొలిసారిగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు విడుదలైన నీళ్లతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి.
తెలంగాణ నేల గొంతు తడిపిన దార్శనికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, అపర భగీరథుడు కేసీఆర్ అకుంఠిత దీక్షకు, ఆయన శ్రమకు దక్కిన ప్రతిఫలమే ఈ జలదృశ్యమని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆయన విజన్ వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలమైందని అంటున్నారు.