గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగు, తాగునీటి ఇబ్బందులను దూరం చేసిన మహానాయకుడని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బూరుగుపల్లిలో గోదావరి జలాలకు పూజలు చేసిన సందర్భంగా రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా సాగునీటి కోసం తపిస్తున్న రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు.
మూడేండ్లుగా కొండపోచమ్మకాలువ ద్వారా కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలను వదలడంతో వేలాది మంది రైతులు సాగు చేసిన వరికి ఊపిరిపోసినట్లు అవుతుందన్నారు. దేశానికి సీఎంకేసీఆర్ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల వారు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. దేశానికి మేలు చేయడానికే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు.
దేశానికి కాబోయే ప్రధాని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నరని, ఎంతో పారదర్శకంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వంటేరు విజయవర్ధన్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్, గ్రామ కమిటీ అధ్యక్షుడు చెలిమేటి రాజు, చంద్రగౌడ్, స్వామి, భాస్కర్రెడ్డి, భరత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వాహద్, సత్తయ్య పాల్గొన్నారు.