హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం బరాజ్లపై విచారణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించారు. ఫిబ్రవరి 28లోగా నివేదికను సమర్పించాలని సూచిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుపై విచారణ చేపట్టి 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరుతూ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ను గతేడాది ఫిబ్రవరిలో నియమించింది. ఆ గడువు జూన్లో ముగిసిపోగా.. అక్టోబర్ 31 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు పెంచినప్పటికీ విచారణ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఫిబ్రవరి 28 వరకు కమిషన్ గడువును పొడిగించింది.