హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): వరంగల్ నగరంలోని కాకతీయ జూపార్క్కు త్వరలోనే పెద్దపులి, అడవిదున్నను తీసుకురావడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వీటితోపాటు మరో రెండు జింకలను ఏప్రిల్ ఒకటి నుంచి జూపార్క్లో సందర్శనకు అందుబాటులో ఉంచుతామని చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఎంసీ పర్గెయిన్ తెలిపారు. ప్రస్తుతం జూపార్క్లో సౌకర్యాలు, అదనపు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. కొత్తగా పక్షుల కేంద్రాన్ని, బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించారు.