వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 7: పారా మెడికల్ కోర్సులో ప్రవేశాలకు కాకతీయ వైద్య కళాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఈనెల 28, 29వ తేదీల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత గల విద్యార్థులు విభాగాల వారీగా కేఎంసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. 28న డిప్లొమా ఇన్ కార్డియాలజీ, డిప్లొమా ఇన్ డయాలసిస్, డీఏఎన్ఎస్, డీఎంఎస్టీ, డీవోఏ, డీఈపీటీ కోర్సులకు, 29న డీఎంసీటీ, డీఆర్ఈఎస్టీ, డీఈసీజీ, డీఆర్జీఏ, డీఎంఐటీ, డీడీఆర్ఏ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు తమ పూర్తి ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.