వరంగల్, జూన్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాకతీయ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వారం రోజులపాటు వేడుకలను నిర్వహించనున్నది. ఈ ఉత్సవాల్లో కాకతీయుల వారసులను భాగస్వాములను చేయాలని భావిస్తున్నది.
ఈ మేరకు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ గురువారం ఛత్తీస్గఢ్లోని బస్తర్కు వెళ్లి కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను ఆహ్వానించారు. ఈ ఉత్సవాలకు తప్పక హాజరవుతానని కమల్చంద్ర తెలిపారు. వరంగల్ను సందర్శించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. దాస్యం వెంట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య ఉన్నారు.