Kadiyam Kavya | వరంగల్ : వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించమని నేను ప్రజలందరికి కోరుకుంటున్నాను.. మీ అందరి గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడుతాను అని ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం కావ్య మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్. బీజేపీ కొత్తగా వచ్చిన పార్టీ కాదు.. గత పదేండ్ల నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తూనే వస్తోంది. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎంపీలు వారి నాయకత్వం ప్రకారం నడుచుకుంటారు. వారికి వేరే ప్రయోజనాలు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్కు మాత్రం వేరే ప్రయోజనాలు లేవు. ఆయన కేవలం రాష్ట్రం కోసం పోరాడారు. తెలంగాణను సాధించారు అని కడియం కావ్య తెలిపారు.