జోగులాంబ గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల ( Jogulamba Gadwal ) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ( Politehnic Students ) జిల్లా కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు ఉదృతం చేశారు.
కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు పట్టుబట్టారు. ఉదయం ప్రారంభమైన ఆందోళన సాయంత్రం వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.