హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయించిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ విచారణ చేపట్టనున్నారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం ఉదయం విచారణ జరగనున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీ హరికి స్పీకర్ సమాచారం పంపించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును త్వరితగతిన విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే అనేకసార్లు స్పీకర్కు సూచించింది. అయినప్పటికీ వివిధ కారణాలతో విచారణ ఆ లస్యం అవుతున్నది. ఎమ్మెల్యేలు దా నం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మొ దలేకాలేదు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు స్పీకర్ కార్యాలయం కడియం శ్రీహరి విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈనెలాఖరులోపు ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నది.