హైదరాబాద్ : మానవీయ కోణంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే దేశానికే రోల్ మోడల్గా నిలిపిన ఘతన సీఎం కేసీఆర్(CM KCR)కే దక్కుతుందని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiyam Srihari ) అన్నారు. సోమవారం(Station Ghanpur) స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..గత 30 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించానని తెలిపారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి కాకముందు నియోజకవర్గంలో బీడు భూములు ఉండేవి.
కేసీఆర్ సీఎం అయ్యాక దేవాదులను త్వరగా పూర్తి చేసి ఏడు రిజర్వాయర్లను కట్టించి ప్రతి ఎకరాకు సాగుకు నీరందించారు. దీంతో నేడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పచ్చని పంటలతో విలసిల్లుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాలకు గోదావరి జలాలు అందించాలి. అలాగే ఘన్పూర్లో మాడల్ డిగ్రీ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
వంద పడకల దవాఖాన అభివృద్ధికి సహకరించాలని, లెదర్ ఇనిస్టిట్యూట్ను కూడా అభివృద్ది చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వీటితో పాటు మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. మరిన్ని నిధులు కేటాయించి స్టేషన్ ఘన్పూర్ను అభివృద్ధి చేయాలని కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు.