యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagir gutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి సేవలో (Lakshmi Narasimha Swamy) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan) సతీ సమేతంగా తరించారు. ఆదివారం ఉదయం కొండపైకి చేరుకున్న చీఫ్జస్టిస్కు ఉత్తర ద్వారం వద్ద స్వస్తి వాచనంతో ప్రధానార్చకులు నల్లన్థీఘల్ లక్ష్మీ నరసింహ చార్యులు ఘనస్వాగతం పలికారు. ప్రధానాలయ ముఖ మండపంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా స్వయంభూ గర్భాలయనికి చేరుకుని స్వయంభూ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చక బృందం చతుర్వేద మహా ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో గీత స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ఆలేరు న్యాయమూర్తి సుమలత, కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ, ఏసీపీ తదితరులు ఉన్నారు.