భూపాలపల్లి: జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీసుధ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న జస్టిస్ సుధా దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు జస్టిస్ సుధా దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.