హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జున మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదించడంతో బది లీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్ బీ దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో హైకోర్టులోని మొద టి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన మంగళవారం వీడోలు సమావేశాన్ని నిర్వహించి జస్టిస్ నాగార్జున సేవలను కొనియాడారు.
అనంతరం జస్టిస్ నాగార్జున మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తనకు సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. జస్టిస్ నాగార్జున సేవలు ఎనలేనివని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. జస్టిస్ నాగార్జున కష్టపడేతత్వాన్ని, పనితీరును, సమర్ధనను కొనియాడారు. రాష్ట్ర హైకోర్టులో సీజేతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉండగా.. జస్టిస్ నాగార్జున బదిలీతో ఆ సంఖ్య 31కి తగ్గింది.