తెలుగు యూనివర్సిటీ, మార్చి 23: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంపై వ్యాపారులు అవగాహన పెంపొందించుకోవాలని, ఆ చట్టంలోని నిబంధనలకు కట్టుబడుతూ ప్రభుత్వానికి సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సూచించారు. ‘లీగల్ ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ టాక్సేషన్’ అనే అంశంపై ఏఐఎఫ్టీపీ-ఎస్జెడ్, టీటీపీఏ, ఫ్యాప్సీ ఆధ్వర్యంలో శనివారం ఫ్యాప్సీ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
జీఎస్టీ చట్టంలోని పలు సెక్షన్లు, వివిధ తీర్పుల గురించి వివరించారు. చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ఉపకరిస్తాయని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు.