హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : నిద్ర.. పరిపూర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైనది. మెదడుకు విశ్రాంతి ఇవ్వడంతోపాటు ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఎంతో అవసరం. రోగ నిరోధకశక్తి పెరగడానికి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది.
అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితలంలో నిద్రలేమి సమస్య పెద్ద విపత్తుగా మారుతున్నది. మన దేశంలో సగం మంది ఆరు గంటల కన్నా తక్కువ నిద్ర పోతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలో 46% మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్ర పోతున్నట్టు ‘లోకల్ సర్కిల్స్’ రిపోర్టు తెలిపింది.