హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టుల భర్తీలో భాగంగా నేడు మరి కొంతమంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. బోటనీ, హిందీ, తెలుగు, జువాలజీ అభ్యర్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ను నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. గైర్హాజరైన వారికి 27న రిజర్వ్డేలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.