టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది. బీజేపీ బరితెగింపు చూసి యావత్ తెలంగాణ ప్రజానీయం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ కావడంపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కూడా తన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ధర్మ సూత్రాలు మతం మంత్రాల ముసుగులో నయా ఉదారవాద డబ్బును ఎలా ప్రసరింపచేస్తున్నారో చూడండి. చిన్న రాష్ట్రాల, ప్రాంతాల ప్రాంతీయ అస్తిత్వాల ఆశలను, ఆశయాలను ఎలా తొక్కేస్తున్నారో కల్లారా చూడండి. చెవులారా వినండి. మానవీయ మతసామరస్య తెలంగాణ సమాజాన్ని తన స్వీయ అస్తిత్వ ఆకాంక్షలను డబ్బు సంచులతో కొనాలన్న కుట్రలు బహిర్గతమయ్యాయి.
ప్రశాంతంగా తనను తాను అభివృద్ధి చేసుకుంటూ అన్ని రంగాలను పునర్నిర్మించుకుంటున్న సమయంలో ఆర్థిక ఆధిపత్యాల మార్కెట్ ప్రలోభాలతో తెలంగాణను చిత్రం చేయాలని ఎన్నెన్ని కుట్రలు పన్నుతున్నారో చూడండి. ఇదే శక్తులు రేపు తెలంగాణను మత కలహాల కేంద్రంగా మార్చే పన్నాగాలు పన్నుతారు.
అయ్యో… దేశమంటే అమ్మకాల కొనుగోళ్ల కేంద్రం చేసి ఇద్దరు అమ్మటం మరో ఇద్దరు కొనుగోలు చేయటమా దేశభక్తి అని మునుగోడు తన పోరాట చైతన్య వారసత్వంతో ప్రశ్నిస్తుంది.
తెలంగాణ స్వీయ అస్తిత్వాన్ని దెబ్బతీయటానికి ఎన్ని కుట్రలకైనా తెగిస్తారని తెలుస్తుంది. కేంద్రానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిలిచినా క్రూరంగా అణిచివేస్తూ లేదంటే కూల్చివేస్తూ ఫెడరల్ వ్యవస్థ పెడరెక్కల గురిచేస్తూ ప్రజాస్వామ్యానికే పాడెకట్టేస్తున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కాపాడుకుందాం పదండి’ అని పేర్కొన్నారు.