హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా గౌరీశంకర్ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జూలూరు రచించిన ‘ఈ సమరం సామరస్యం కోసం’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.