జగిత్యాల, మార్చి 29: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ప్రెస్మీట్లను బహిష్కరిస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జగిత్యాల జిల్లా శాఖ, జగిత్యాల ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణాచారి, జగిత్యాల ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్ పేర్కొన్నారు. గజ్జెల కాంతం అసభ్యకరమైన, అనుచితమైన భాషతో పాత్రికేయులను అవమానించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన పాల్గొనే ప్రెస్మీట్లు, కార్యక్రమాల కవరేజ్ను బహిషరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం జగిత్యాల ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులు గజ్జెల కాంతం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
గజ్జెల కాంతం ప్రెస్మీట్లను జగిత్యాల జిల్లా పరిధిలో బహిషరించాలని జగిత్యాల జిల్లా యూనియన్, ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డితోపాటు జగిత్యాల డీసీసీ అధ్యక్షుడికి పంపినట్టు తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.