ఖైరతాబాద్, జనవరి 17: జర్నలిస్టు చిలుక ప్రవీణ్పై పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం దాడి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన జర్నలిస్టు చిలుక ప్రవీణ్ ప్రస్తుతం యూ న్యూస్ చానెల్ సీఈవోగా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం సోమాజిగూడలోని కీర్తిలాల్ లేన్లో సుధాకర్ అనే వ్యక్తి ప్రవీణ్పై దాడిచేశాడు. షర్ట్ చింపి తీవ్రంగా కొట్టాడు. గతంలో క్యూన్యూస్లో పనిచేసిన ప్రవీణ్.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాడని ఆరోపిస్తూ సుధాకర్ దాడి చేశాడు. బాధితుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
దాడి హేయం: హరీశ్రావు జర్నలిస్టు ప్రవీణ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నాడనే ముద్రవేసి భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు.