నల్లగొండ: తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో కట్టంగూర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు వందమంది ఎమ్మెల్యే సమక్షంవలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎవరూ ఊహించని విధంగా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో పెద్ది బాల నర్సింహా గౌడ్, ఐతగొని రాములు గౌడ్, గాదగోని సుజాత ఉప సర్పంచ్, చౌగొని లింగయ్య, పెద్ది బిక్షం, గోగు సైదులు, అంతటి రమేశ్, గుండు అంజయ్య కానుగు జానయ్య, అంతటి సతీశ్, చిత్తలూరి లక్ష్మి, కానుగు చంద్రమ్మ, ఆకుల కృష్ణ, గాదగోజు శేఖర్ తదితరులు ఉన్నారు.