నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహంగా చేరుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం శాలి గౌరారం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులతో పాటు సుమారు వెయ్యి మంది టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో కలిసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.