వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలం బిక్కోజి నాయక్ తండాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, సర్పంచ్ విద్యారాణి (వంశీ) ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరడంతో వారికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.