నల్లగొండ : బీఆర్ఎస్లోకి చేరికల పరంపర జోరుగా కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షుతులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా.. కేతపల్లి మండలం చీకటిగుడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బుద్దే గణేష్, మాజీ వార్డు మెంబర్ కోట సైదయ్య, ఎగ్గేడి సత్యనారయణ, యగ్గిడి వినోద, బుద్దే సురేష్, బుద్దే మధు, నవీన్, ఏనాసు రాకేష్, బర్రి సాయి, కోట రాఘవేందర్, ఆలుదాసు సైదులు, సాదే నవీన్, కోట నవీన్, వెంబటి బక్కయ్య, వడ్డే సతీష్, కోట పూర్ణ చందర్ రావు, సల్లోజు జానకమ్మ, గున్న స్వాతి, కోట పద్మ తదితరులు ఉన్నారు.