హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. గురువారం పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఎన్సీపీ థానే నగర ఉపాధ్యక్షుడు మక్సూద్ ఖాన్, శివసేన థానే నగర ఉపాధ్యక్షుడు తుషార్ వతన్ బర్షికర్, ఆ పార్టీ థానే బ్లాక్ అధ్యక్షుడు రాజేంద్ర శిర్ధాంకర్, ఎన్సీపీ థానే నగర సికు శాఖ అధ్యక్షుడు జగత్ సింగ్, బ్రాహ్మణ సేవా సంఘ్ కార్యదర్శి విపిన్ శర్మ, అమన్ సోషల్ సంస్థ ముంబై ఉపాధ్యక్షుడు అఫాక్ ఖాన్, ఎన్సీపీ మైనారిటీ సెల్ థానే జిల్లా కార్యదర్శి అస్ఘర్ అలీ ఖాన్ బండే తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.